Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమరిపోతు వ్యవసాయం ఏదైనావుందంటే అది వరిసాగే : మంత్రి రంగనాథ రాజు

Webdunia
ఆదివారం, 28 మార్చి 2021 (09:06 IST)
ప్రస్తుతం సోమరిపోతు వ్యవసాయం ఏదైనా ఉందంటే.. అది ఒక్క వ్యవసాయం మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి శ్రీరంగనాథ రాజు వ్యాఖ్యానించారు. తాను వేరే జిల్లాలకు వెళ్లినప్పుడు రైతులకు ఇదే విషయం చెబుతుంటానని సెలవిచ్చారు. 
 
శనివారం పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో జరిగిన కృషి విజ్ఞానకేంద్రం రజతోత్సవంలో మంత్రి రంగనాథరాజు మాట్లాడారు. 'సోమరి పోతు వ్యవసాయం ఏదైనా ఉందంటే అది వరి సాగే. రైతులు కష్టపడాల్సిన అవసరం లేదు. ఏఈగారు కాల్వలకు నీరు వదిలితే పొలంలోకి నీళ్లు వస్తున్నాయి. ఒరేయ్‌ బాబూ ఆకుమడి దున్ను... అంటే వచ్చి దున్నుతాడు బస్తా విత్తనాలు పొలంలో పడేస్తే... ఇంతని డబ్బులు ఇస్తే విత్తనాలు, ఎరువులు చల్లుతున్నారు. ఊడ్పులకూ అంతే! బస్తాకు ఇంత అని ఇస్తే సరిపోతుంది' అని వ్యాఖ్యానించారు. 
 
మంత్రి మాటలతో కిసాన్‌మేళాకు హాజరైన రైతులంతా ఒక్కసారిగా విస్తుపోయారు. ఇక్కడ విచిత్రమేమింటే శ్రీరంగనాథ రాజు గతంలో రైస్‌ మిల్లుల అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కూడా పని చేయడం గమనార్హం. ఇదేసమయంలో వరిసాగులో ఉన్న కష్టాలను కూడా మంత్రి వివరించారు. 90 శాతానికి మందిపైగా కౌలు రైతులే ఉన్నారని, ఇబ్బంది వస్తే వారే నష్టపోతున్నారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments