Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా తగ్గినా.. మాస్క్‌ల వాడకం తప్పదు.. ఏపీ మంత్రి బుగ్గన

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (16:59 IST)
కరోనా మహమ్మారి ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చైనా వుహాన్‌లో పుట్టుకొచ్చిన ఈ రోగం.. ప్రపంచ జనాలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కరోనాపై వ్యాఖ్యలు చేశారు. కరోనాతో సహజీవనం తప్పదని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. 
 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చెప్పిన మాటలు అక్షర సత్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అంతే కాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే విషయం చెప్పిందని, మరోవైపు ఫేస్‌ మాస్కులు జీవితంలో భాగమని ప్రధాని నరేంద్ర మోదీ కూడా అన్నారని గుర్తు చేశారు. 
 
కరోనాపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు అక్షరసత్యాలని వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో కరోనా వైరస్ ప్రభావం తగ్గినా మాస్క్‌లు వాడటం తప్పనిసరి అవుతుందని.. ఇది మన ఆరోగ్య రక్షణగా మారుతుందన్నారు. 
 
కరోనా వైరస్‌ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలని జగన్ ఆలోచిస్తుంటే, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌లో కూర్చుని విమర్శలు చేస్తున్నారని అన్నారు. కరోనా వైరస్‌తో ఇబ్బంది పడుతున్న ప్రజలకు టీడీపీ నేతలెవరూ సాయం చేయలేదని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments