కరోనా తగ్గినా.. మాస్క్‌ల వాడకం తప్పదు.. ఏపీ మంత్రి బుగ్గన

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (16:59 IST)
కరోనా మహమ్మారి ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చైనా వుహాన్‌లో పుట్టుకొచ్చిన ఈ రోగం.. ప్రపంచ జనాలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కరోనాపై వ్యాఖ్యలు చేశారు. కరోనాతో సహజీవనం తప్పదని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. 
 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చెప్పిన మాటలు అక్షర సత్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అంతే కాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే విషయం చెప్పిందని, మరోవైపు ఫేస్‌ మాస్కులు జీవితంలో భాగమని ప్రధాని నరేంద్ర మోదీ కూడా అన్నారని గుర్తు చేశారు. 
 
కరోనాపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు అక్షరసత్యాలని వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో కరోనా వైరస్ ప్రభావం తగ్గినా మాస్క్‌లు వాడటం తప్పనిసరి అవుతుందని.. ఇది మన ఆరోగ్య రక్షణగా మారుతుందన్నారు. 
 
కరోనా వైరస్‌ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలని జగన్ ఆలోచిస్తుంటే, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌లో కూర్చుని విమర్శలు చేస్తున్నారని అన్నారు. కరోనా వైరస్‌తో ఇబ్బంది పడుతున్న ప్రజలకు టీడీపీ నేతలెవరూ సాయం చేయలేదని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments