Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ : మంత్రి బొత్స

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (20:16 IST)
రాజధాని అమరావితలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైనపుడు అన్ని వివరాలను బహిర్గతం చేస్తామంటూ ఆయన సోమవారం ప్రటించారు. 
 
ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, రాజధానిలో జరిగిన భూ అక్రమాలపై తమ వద్ద పూర్తి సమాచారం ఉందని.. సరైన సమయంలో ఆ అక్రమాల చిట్టా బహిరంగ పరుస్తామన్నారు. కేంద్ర మాజీ మంత్రి తనకు రాజధానిలో భూములే లేవంటున్నారని.. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన సవాల్‌ విసిరితే మొత్తం వివరాలు బయటపెడతామని హెచ్చరించారు. 
 
భాజపా ఎంపీ టీజీ వెంకటేశ్‌ పేర్కొన్న నాలుగు రాజధానుల అంశాన్ని మీడియా ప్రతినిధులు బొత్స వద్ద ప్రస్తావించగా.. ఆ విషయం టీజీనే అడగాలంటూ సలహా ఇచ్చారు. రాజధానిపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గతంలో ఏం చెప్పారో.. ఇప్పుడేం మాట్లాడారో రికార్డు చూడాలని కోరారు. 
 
అమరావతిపై గతంలో భాజపా కూడా ఆరోపణలు చేసిందన్నారు. రాజధాని అంటే ఏ ఒక్క సామాజిక వర్గానికో చెందినది కాదన్నారు. కౌలు అందలేదని రైతులు ఆందోళన చేస్తున్నారనీ, ఇదే అంశంపై ముఖ్యమంత్రితో మాట్లాడానని, వారం రోజుల్లో కౌలు చెల్లిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పైగా, రాజధానిపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడివున్నట్టు ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments