Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ : మంత్రి బొత్స

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (20:16 IST)
రాజధాని అమరావితలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైనపుడు అన్ని వివరాలను బహిర్గతం చేస్తామంటూ ఆయన సోమవారం ప్రటించారు. 
 
ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, రాజధానిలో జరిగిన భూ అక్రమాలపై తమ వద్ద పూర్తి సమాచారం ఉందని.. సరైన సమయంలో ఆ అక్రమాల చిట్టా బహిరంగ పరుస్తామన్నారు. కేంద్ర మాజీ మంత్రి తనకు రాజధానిలో భూములే లేవంటున్నారని.. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన సవాల్‌ విసిరితే మొత్తం వివరాలు బయటపెడతామని హెచ్చరించారు. 
 
భాజపా ఎంపీ టీజీ వెంకటేశ్‌ పేర్కొన్న నాలుగు రాజధానుల అంశాన్ని మీడియా ప్రతినిధులు బొత్స వద్ద ప్రస్తావించగా.. ఆ విషయం టీజీనే అడగాలంటూ సలహా ఇచ్చారు. రాజధానిపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గతంలో ఏం చెప్పారో.. ఇప్పుడేం మాట్లాడారో రికార్డు చూడాలని కోరారు. 
 
అమరావతిపై గతంలో భాజపా కూడా ఆరోపణలు చేసిందన్నారు. రాజధాని అంటే ఏ ఒక్క సామాజిక వర్గానికో చెందినది కాదన్నారు. కౌలు అందలేదని రైతులు ఆందోళన చేస్తున్నారనీ, ఇదే అంశంపై ముఖ్యమంత్రితో మాట్లాడానని, వారం రోజుల్లో కౌలు చెల్లిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పైగా, రాజధానిపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడివున్నట్టు ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments