Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోల్తా పడిన ఏపీ మంత్రి బాలినేని ఎస్కార్ట్ వాహనం .. ఒకరి మృతి

Webdunia
మంగళవారం, 7 జులై 2020 (18:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎస్కార్ట్ వాహనం బోల్తాపడింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో పెద్ద అంబర్ పేట వద్ద ఈ ప్రమాదం జరిగింది. మంత్రి ఎస్కార్ట్ వాహనంలోని ఓ వాహనం టైరు పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హెడ్ కానిస్టేబుల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. 
 
వీరిని హయత్ నగర్‌లో సన్‌రైజస్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మంత్రి బాలినేని గచ్చిబౌలి నుంచి విజయవాడకు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో మంత్రి మరో వాహనంలో ప్రయాణిస్తుండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments