Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు కరోనా పరీక్షలు... రిజల్ట్ ఏంటి?

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (09:25 IST)
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖామంత్రిగా విధులు నిర్వహిస్తున్న అనిల్ కుమార్ యాదవ్‌కు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఈయన కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతూ వచ్చిన ఓ వైద్యుడిని కలిశారు. దీంతో మంత్రి అనిల్ కుమార్‌కు ఈ పరీక్షలు నిర్వహించారు. 
 
ప్రస్తుతం కరోనా పాజిటివ్ లక్షణాలతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్యుడు ఇటీవల సొంతగా ఆస్పత్రిని నెలకొల్పారు. దీని ప్రారంభోత్సవానికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను ఆ డాక్టర్ ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు ఆస్పత్రి ప్రారంభోత్సవానికి మంత్రి అనిల్ వెళ్లారు. 
 
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆస్పత్రిని నెలకొల్పిన వైద్యుడు కరోనా లక్షణాలతో బాధపడుతుంటే కరోనా పరీక్షలు నిర్వహించగా, ఫలితాల్లో కరోనా పాజిటివ్ అని వచ్చింది. దీంతో అప్రమత్తమైన జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు కూడా ఈ కరోనా పరీక్షలు నిర్వహించారు. 
 
ఈ పరీక్షా ఫలితాలు వచ్చేంత వరకు అంటే 36 గంటల పాటు మంత్రి అనిల్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. అయితే, ఈ ఫలితాల్లో ఆయనకు కరోనా నెగెటివ్ అని రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా వైరస్ భయభ్రాంతులకు గురిచేస్తున్న విషయం తెల్సిందే. ఈ రాష్ట్రంలో కరోనా కేసులు ఇప్పటికే 300కు మించిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments