Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ విద్యా మంత్రి సురేష్‌కు కరోనా పాజిటివ్

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (17:07 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులకు కరోనా వైరస్‌ సోకింది. తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన తన వాట్సాప్ స్టేటస్ ద్వారా తెలిపారు.
 
 స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకున్నానని, పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వైద్యుల సూచన మేరకు దవాఖానలో చేరానని ఆయన తెలిపారు. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కూడా కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. 
 
మరోవైపు, చిత్తూరు జిల్లా తిరుచనూరులోని శ్రీ పద్మావతి నిలయంలో ఏర్పాటు చేసిన కోవిడ్ -19 సంరక్షణ కేంద్రాన్ని సోమవారం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలో చికిత్స పొందుతున్న వారికి అందుతున్న సేవలను వారిని అడిగి తెలుసుకున్నారు. 
 
రోగుల పట్ల సరైన శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. రోగుల నుంచి ఫిర్యాదు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం వంట గదిని, మందుల పంపిణీ కేంద్రాన్ని, కరోనా పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రంలోని ఉద్యోగులతో మాట్లాడి వారి పని తీరును ప్రశంసించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments