Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ విద్యా మంత్రి సురేష్‌కు కరోనా పాజిటివ్

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (17:07 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులకు కరోనా వైరస్‌ సోకింది. తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన తన వాట్సాప్ స్టేటస్ ద్వారా తెలిపారు.
 
 స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకున్నానని, పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వైద్యుల సూచన మేరకు దవాఖానలో చేరానని ఆయన తెలిపారు. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కూడా కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. 
 
మరోవైపు, చిత్తూరు జిల్లా తిరుచనూరులోని శ్రీ పద్మావతి నిలయంలో ఏర్పాటు చేసిన కోవిడ్ -19 సంరక్షణ కేంద్రాన్ని సోమవారం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలో చికిత్స పొందుతున్న వారికి అందుతున్న సేవలను వారిని అడిగి తెలుసుకున్నారు. 
 
రోగుల పట్ల సరైన శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. రోగుల నుంచి ఫిర్యాదు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం వంట గదిని, మందుల పంపిణీ కేంద్రాన్ని, కరోనా పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రంలోని ఉద్యోగులతో మాట్లాడి వారి పని తీరును ప్రశంసించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments