Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ విద్యా మంత్రి సురేష్‌కు కరోనా పాజిటివ్

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (17:07 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులకు కరోనా వైరస్‌ సోకింది. తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన తన వాట్సాప్ స్టేటస్ ద్వారా తెలిపారు.
 
 స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకున్నానని, పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వైద్యుల సూచన మేరకు దవాఖానలో చేరానని ఆయన తెలిపారు. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కూడా కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. 
 
మరోవైపు, చిత్తూరు జిల్లా తిరుచనూరులోని శ్రీ పద్మావతి నిలయంలో ఏర్పాటు చేసిన కోవిడ్ -19 సంరక్షణ కేంద్రాన్ని సోమవారం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలో చికిత్స పొందుతున్న వారికి అందుతున్న సేవలను వారిని అడిగి తెలుసుకున్నారు. 
 
రోగుల పట్ల సరైన శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. రోగుల నుంచి ఫిర్యాదు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం వంట గదిని, మందుల పంపిణీ కేంద్రాన్ని, కరోనా పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రంలోని ఉద్యోగులతో మాట్లాడి వారి పని తీరును ప్రశంసించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ వాయిదాకు కారణం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

తర్వాతి కథనం
Show comments