Webdunia - Bharat's app for daily news and videos

Install App

లారీ కిస్తీలు క‌ట్ట‌లేక‌పోతున్నాం... హరితపన్ను నిలిపివేయండి..

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (15:10 IST)
సీఎం జగన్​కు లారీ యజమానుల సంఘం లేఖ రాసింది. కొవిడ్ ఇబ్బందుల దృష్ట్యా హరిత పన్నుపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేసింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ఫైనాన్స్ కిస్తీలు కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని గుంతలమయమైన రోడ్లను అభివృద్ధి చేయాలని కోరారు. కొవిడ్​తో తాము తీవ్ర కష్టాలు పడుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నుంచి పెంచిన హరిత పన్ను వసూలును వెంటనే నిలిపివేయాలని లారీ యజమానులు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్​కు లారీ ఒనర్స్ అసోషియేషన్ లేఖ రాసింది. 
 
 
కొవిడ్ కారణంగా రాష్ట్రంలో రవాణా రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని లారీ యజమానులు.. సీఎం దృష్టికి తెచ్చారు. తీవ్ర మందగమనం ఉన్నందున రోజు వారి ఖర్చులను నిర్వహించడమూ కష్టమవుతోందని తెలిపారు. ఫైనాన్స్ కిస్తీలు కట్టలేకపోవడంతో వేల లారీలను ఫైనాన్స్ వారు స్వాధీనం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో దేశంలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం హరిత పన్ను పెంచిందని పేర్కొన్నారు. వాహనాలను బట్టి 200 రూపాయల నుంచి 20 వేలకు పన్నులు వసూలు చేస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. హరిత పన్ను పెంపు వల్ల లారీ యజమానులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే హరిత పన్ను వసూలును నిలుపుదల చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

Love Jatara: అంకిత్ కొయ్య, మానస చౌదరి జంటగా లవ్ జాతర

కన్నప్ప మూవీ రివ్యూ- కథ మారింది-కల్పితం: నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం వుంది!

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments