Webdunia - Bharat's app for daily news and videos

Install App

న‌న్ను అభినందించ‌డానికి వ‌చ్చి... ఎవ‌రికైనా ఒమిక్రాన్ వ‌స్తే....

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (14:05 IST)
ప్రజల ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది 2022 నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి  పేర్ని వెంకట్రామయ్య ( నాని)  శుక్రవారం ఉదయం ఒక ప్రకటన లో పేర్కొన్నారు. 
 
 
రాష్ట్రంలో సైతం ఒమిక్రాన్ కేసులు శరవేగంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ప్రజల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి నూతన సంవత్సరం వేడుకలు తాను జరుపుకోవడం లేదని మంత్రి  తెలిపారు. కొత్త సంవత్సర వేడుకలు మీ కుటుంబసభ్యుల మధ్యలో మీరు ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాన‌ని పేర్కొన్నారు. 
 
 
కొత్త ఏడాది వేడుకల తరువాత ఒకవేళ ఒమిక్రాన్ లక్షణాలు వస్తే, కుటుంబం మొత్తం బాధ పడాలి కాబట్టి ముందు జాగ్రత్తలు తప్పనిసరి అని ఆయన అన్నారు.  కోవిడ్ నివారణకు రెండు వాక్సిన్లు తీసుకున్నవారు ఒకవేళ హోటెళ్లు, రెస్టారెంట్లలో బహిరంగంగా వేడుకలు చేసుకునే వారు, ఎంతో కొంత భౌతిక దూరం పాటించాలన్నారు. అలాగే మాస్కు ధరించి గతంలో మాదిరిగానే శానిటైజర్లు వినియోగించాలని మంత్రి  అన్నారు.  
 
 
ప్రస్తుతం ఒమిక్రాన్ విస్తరిస్తున్న దృష్ట్యా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు , అభిమానులు, నియోజకవర్గం ప్రజలు వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు ఎవరూ తనను కలవడానికి రావద్దని తాను అందుబాటులో ఉండటం లేదని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments