Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చటి కోనసీమలో చిచ్చుకు కారణం ఆ రెండు పార్టీలే : మంత్రి వనిత

Webdunia
బుధవారం, 25 మే 2022 (07:25 IST)
పచ్చటి కోనసీమలో చిచ్చు రాజుకోవడానికి మూల కారణం తెలుగుదేశం, జనసేన పార్టీలేనని ఏపీ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత ఆరోపించారు. కోనసీమ జిల్లా పేరును డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చారు. దీన్ని ఆ జిల్లా వాసులు తీవ్రంగా వ్యతిరేకించారు. కోనసీమ జిల్లాగానే కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 
 
అయితే, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ప్రజలు తిరుగుబాటు చేశారు. ఫలితంగా జిల్లా కేంద్రమైన అమలాపురం అగ్నికి ఆహుతైంది. అధికార పార్టీకి చెందిన మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్ళకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పలు హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. 
 
దీనిపై హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, కోనసీమ అల్లర్ల వెనుక టీడీపీ, జనసేన పార్టీలు ఉన్నాయని ఆరోపించారు. హింసాత్మక ఘటనల్లో 20 మంది పోలీసులకు గాయాలయ్యాయనని వెల్లడించారు. జిల్లాకు అంబేద్కర్ పేరును వ్యతిరేకించడం సబబు కాదన్నారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరిట నామకరణం చేసినందుకు గర్వించాలని ఆమె అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments