Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ హైకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు ఊరట.. ఎలా?

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2022 (18:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో సినీ నటుడు మోహన్ బాబు కుటుంబానికి ఊరట లభించింది. గత 2019 ఎన్నికలకు ముందు ధర్నాకు దిగి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ నమోదైన కేసులో ఆయన ఊరట లభించింది. ఈ కేసు విచారణను నిలుపుదల చేయాలంటూ హైకోర్టులో మోహన్ బాబు తరపున కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారించిన కోర్టు 8 వారాల పాటు విచారణను వాయిదా వేసింది. 
 
గత 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఆరోపిస్తూ తన ఇద్దరు కుమారులతో కలిసి మోహన్ బాబు ధర్నాకు దిగారు. ఈ వ్యవహారంపై మోహన్ బాబు, ఆయన ఇద్దరు కుమారులపై తిరుపతి పోలీసుల కేసు నమోదైంది. 
 
ఈ కేసు విచారణ తిరుపతి కోర్టులో సాగుతోంది. ఈ విచారణను నిలుపుదల చేయాలంటూ హైకోర్టులో మోహన్ బాబు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన కోర్టు తిరుపతి కోర్టులో కేసు విచారణను ఎనిమిది వారాల పాటు నిలుపుదల చేసింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments