Webdunia - Bharat's app for daily news and videos

Install App

రఘురామపై ఎస్సీఎస్టీ కేసు - ఫిర్యాదుదారునికి నోటీసులు

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (16:02 IST)
వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఏపీ పోలీసులు నమోదు చేసిన ఎస్సీ ఎస్టీ కేసుపై హైకోర్టుపై స్టే విధించింది. అదేసమయంలో ఈ కేసులో ఫిర్యాదుదారునికి నోటిసులు పంపాలని ఆదేశించింది. ఎస్సీలను రఘురామరాజు కులం పేరుతో దూషించారంటూ వెస్ట్ గోదావరి జిల్లా చింతలపూడి పోలీస్ స్టేషనులో కేసు నమోదైంది. 
 
అయితే, ఏపీ సీఐడీ డీజీ సునీల్ కుమార్ బంధువు తనపై ఈ కేసు పెట్టారంటూ హైకోర్టుకు రఘురామకృష్ణం రాజు తీసుకెళ్ళారు. ముఖ్యంగా, రఘురామరాజు ఎలాంటి దూషణలకు పాల్పడకపోయినప్పటికీ కేసు నమోదు చేశారని రఘురామ తరపు న్యాయవాది వెంకటేష్ వాదనలు వినిపించారు. 
 
ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ ఈ కేసు నమోదు చేశారని చెప్పారు. ఈ వాదనలు ఆలకించిన హైకోర్టు ఈ కేసు విచారణపై స్టే విధించింది. అంతేకాకుండా ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. కాగా గత ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసి గెలుపొందిన రఘురామ ఇపుడు ఆ పార్టీ రెబెల్ ఎంపీగా చెలామణి అవుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments