Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైకోర్టు ముందు హాజరుకావాలని సిపి, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశం

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (13:44 IST)
కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిప‌ల్ ఛైర్మన్ ఎన్నికలో హైటెన్షన్ కొనసాగుతోంది. ఎంపీ కేశినేని నాని త‌మ పార్టీ కౌన్సిల‌ర్ల‌తో మున్సిప‌ల్ కార్యాల‌యంలో బైఠాయించ‌గా, ఇబ్రహింపట్నంలో మంత్రి కొడాలి నాని, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే జోగి రమేశ్ మకాం వేశారు.


ఎన్నికలు జరగకుండా వైసీపీ కౌన్సిలర్ల విధ్వంసం, కుర్చీలు, బిల్లులు విరగ్గొట్టిన వైనంపై ఎంపీ కేశినేని నాని ఆధ్వ‌ర్యంలో టీడీపీ హైకోర్టులో కేసు వేసింది. రెండో రోజు కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ కార్యాల‌యానికి వ‌చ్చిన వైసీపీ కౌన్సిలర్లు, ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్  వాకౌట్ చేశారు. దీనితో రెండో రోజు కూడా ఎన్నిక ఆపివేస్తున్న‌ట్లు అధికారులు చెప్పారు. దీనితో ఫైర్ అయిన ఎంపి కేశినేని నాని, త‌మ టీడీపీ కౌన్సిలర్లుతో మున్సిప‌ల్ హాలులోనే బైఠాయించారు.

 
ఎన్నిక నిలిపేస్తే అది తీవ్రమైన చర్యగా భావించాల్సి ఉంటుందని, రిటర్నింగ్ అధికారికి ఎంపీ కేశినేని నాని స్ప‌ష్టం చేశారు. అయితే, మ‌రో ప‌క్క హైకోర్టులో కొండపల్లి మున్సిపల్ ఎన్నికపై వాడిగా, వేడిగా వాదనలు జ‌రుగుతున్నాయి. లంచ్ మోషన్ పిటిషన్ పై వాద‌న‌లు విన్న త‌ర్వాత‌, మున్సిపల్ కమిషనర్ ఎన్నిక వాయిదా అంశంపై హైకోర్టు సీరియస్ గా స్పందించింది. నిన్న, ఈ రోజు వైసిపి నాయకులు విధ్వంసం సృష్టించారని ధర్మాసనం దృష్టికి లాయర్ అశ్విని కుమార్ తీసుకొచ్చారు.


దీనితో, ఈ మ‌ధ్యాహ్నం హైకోర్టు ముందు హాజరుకావాలని విజయవాడ సిపి శ్రీనివాసులుకు, కొండపల్లి మున్సిపల్ కమిషనర్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొండ‌ప‌ల్లి ఎన్నిక‌ల్లో విధ్వంసంపై వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments