హైకోర్టు ముందు హాజరుకావాలని సిపి, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశం

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (13:44 IST)
కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిప‌ల్ ఛైర్మన్ ఎన్నికలో హైటెన్షన్ కొనసాగుతోంది. ఎంపీ కేశినేని నాని త‌మ పార్టీ కౌన్సిల‌ర్ల‌తో మున్సిప‌ల్ కార్యాల‌యంలో బైఠాయించ‌గా, ఇబ్రహింపట్నంలో మంత్రి కొడాలి నాని, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే జోగి రమేశ్ మకాం వేశారు.


ఎన్నికలు జరగకుండా వైసీపీ కౌన్సిలర్ల విధ్వంసం, కుర్చీలు, బిల్లులు విరగ్గొట్టిన వైనంపై ఎంపీ కేశినేని నాని ఆధ్వ‌ర్యంలో టీడీపీ హైకోర్టులో కేసు వేసింది. రెండో రోజు కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ కార్యాల‌యానికి వ‌చ్చిన వైసీపీ కౌన్సిలర్లు, ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్  వాకౌట్ చేశారు. దీనితో రెండో రోజు కూడా ఎన్నిక ఆపివేస్తున్న‌ట్లు అధికారులు చెప్పారు. దీనితో ఫైర్ అయిన ఎంపి కేశినేని నాని, త‌మ టీడీపీ కౌన్సిలర్లుతో మున్సిప‌ల్ హాలులోనే బైఠాయించారు.

 
ఎన్నిక నిలిపేస్తే అది తీవ్రమైన చర్యగా భావించాల్సి ఉంటుందని, రిటర్నింగ్ అధికారికి ఎంపీ కేశినేని నాని స్ప‌ష్టం చేశారు. అయితే, మ‌రో ప‌క్క హైకోర్టులో కొండపల్లి మున్సిపల్ ఎన్నికపై వాడిగా, వేడిగా వాదనలు జ‌రుగుతున్నాయి. లంచ్ మోషన్ పిటిషన్ పై వాద‌న‌లు విన్న త‌ర్వాత‌, మున్సిపల్ కమిషనర్ ఎన్నిక వాయిదా అంశంపై హైకోర్టు సీరియస్ గా స్పందించింది. నిన్న, ఈ రోజు వైసిపి నాయకులు విధ్వంసం సృష్టించారని ధర్మాసనం దృష్టికి లాయర్ అశ్విని కుమార్ తీసుకొచ్చారు.


దీనితో, ఈ మ‌ధ్యాహ్నం హైకోర్టు ముందు హాజరుకావాలని విజయవాడ సిపి శ్రీనివాసులుకు, కొండపల్లి మున్సిపల్ కమిషనర్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొండ‌ప‌ల్లి ఎన్నిక‌ల్లో విధ్వంసంపై వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments