Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టు ధిక్కరణ కేసులో డీఈవోకు కోర్టు తలంటు - సామాజిక సేవ చేయాలంటూ...

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (10:07 IST)
కోర్టు ధిక్కరణ కేసులో అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారిని హైకోర్టు చీవాట్లు పెట్టింది. పలుమార్లు కోర్టు కోర్టు చేసిన హెచ్చరికలను డీఈవో కె.శ్యామ్యూల్ ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు.. వారం రోజుల పాటు సామాజిక సేవ చేయాలంటూ ఆదేశించింది. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, జిల్లాకు చెందిన సెకండరీ గ్రేడ్ టీచర్ పి.వెంకటరమణకు నోషనల్ సీనియారిటీ కల్పించే విషయంపై గత 2019లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు వెంకటరమణకు అనుకూలంగా తీర్పునిచ్చింది. తక్షణం ఆయనకు సీనియారిటీ కల్పించాలని ఆదేశించింది. 
 
అయితే, కోర్టు ఆదేశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆయనపై కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదైంది. ఈ పిటిషన్‌ను సోమవారం విచారించిన కోర్టు... న్యాయస్థానం అమలులో ఒక యేడాది పాటు జాప్యం కావడానికి డీఈవోనే ప్రధాన కారణమని తేల్చింది. 
 
దీంతో కోర్టుకు ఆయన సారీ చెప్పారు. అయితే, క్షమాపణలు అంగీకరించాలంటే వారం రోజుల పాటు జిల్లాలోని ఏదేని వృద్ధాశ్రమంలోకానీ, అనాథాశ్రమంలోగానీ సామాజికసేవ చేయాలని, వారి భోజన ఖర్చులు భరించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలకు డీఈవో అంగీకరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments