Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసైన్డ్ భూముల కేసులో మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (17:02 IST)
టీడీపీ సీనియర్ నేత, నారాయణ విద్యా సంస్థల ఛైర్మన్ పి.నారాయణకు ఏపీ హైకోర్టు ఊరట కల్పించింది. అసైన్డ్ భూముల కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రాజధాని అమరావతి పరిధిలోని అసైన్డ్ భూముల కుంభకోణంలో నారాయణ పేరను ప్రధాన నిందితుడిగా చేర్చారు. 
 
పైగా, ఈ కేసులో ఇప్పటికే ఏపీ సీఐడీ పోలీసులు పలువురుని అరెస్టు చేశారు. దీంతో తనను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని భావించిన నారాయణ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... ఆయనకు బుధవారం మూడు నెలల పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 
 
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ విదేశాల్లో చికిత్స తీసుకోవాల్సి ఉందని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇదే అంశం ఆధారంగా ఇది వరకే ఆయన ఓ కేసులో ముందస్తు బెయిల్ పొందారు. 
 
అయితే, అసైన్డ్ భూముల కేసులో నారాయణ కీలక నిందితుడిగా ఉన్నందున ఆయనకు బెయిల్ మంజూరు చేయరాదంటూ ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన కోర్టు నారాయణకు మూడు నెలల పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments