Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసైన్డ్ భూముల కేసులో మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (17:02 IST)
టీడీపీ సీనియర్ నేత, నారాయణ విద్యా సంస్థల ఛైర్మన్ పి.నారాయణకు ఏపీ హైకోర్టు ఊరట కల్పించింది. అసైన్డ్ భూముల కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రాజధాని అమరావతి పరిధిలోని అసైన్డ్ భూముల కుంభకోణంలో నారాయణ పేరను ప్రధాన నిందితుడిగా చేర్చారు. 
 
పైగా, ఈ కేసులో ఇప్పటికే ఏపీ సీఐడీ పోలీసులు పలువురుని అరెస్టు చేశారు. దీంతో తనను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని భావించిన నారాయణ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... ఆయనకు బుధవారం మూడు నెలల పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 
 
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ విదేశాల్లో చికిత్స తీసుకోవాల్సి ఉందని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇదే అంశం ఆధారంగా ఇది వరకే ఆయన ఓ కేసులో ముందస్తు బెయిల్ పొందారు. 
 
అయితే, అసైన్డ్ భూముల కేసులో నారాయణ కీలక నిందితుడిగా ఉన్నందున ఆయనకు బెయిల్ మంజూరు చేయరాదంటూ ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన కోర్టు నారాయణకు మూడు నెలల పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments