Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పటం గ్రామస్థులపై హైకోర్టు సీరియస్ - రూ.లక్ష చొప్పున అపరాధం

Webdunia
గురువారం, 24 నవంబరు 2022 (17:28 IST)
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామస్తులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ గ్రామంలో రోడ్డు విస్తరణల పేరుతో పలు గృహాలను కూల్చివేశారు. ఇది పెద్ద వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ వారికి ఊహించని విధంగా షాక్ తగిలింది. 
 
ఇప్పటం గ్రామంలో కూల్చివేతలకు సంబంధించి ముందుగా నోటీసులు ఇచ్చినా.. నోటీసులు ఇవ్వలేదంటూ బాధితులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపైనే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తారంటూ మండిపడింది. ఈ క్రమంలో ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది. 
 
ఈ కేసులో హైకోర్టు గతంలో స్టే ఇవ్వగా, గురువారం ఇరు వర్గాల వాదనలు ఆలకించింది. ఇళ్ల కూల్చివేతలపై తమకు ప్రభుత్వం ముందస్తు నోటీసులు ఇవ్వలేదని పిటిషన్‌దారులు పేర్కొనగా, నోటీసులు ఇచ్చిన తర్వాతే ఆక్రమణలను కూల్చివేశామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపాపారు. 
 
ఈ సందర్భంగా నోటీసులు ఇచ్చింది నిజమేనని హైకోర్టు గుర్తించడంతో ఇప్పటం గ్రామస్థులకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఈ క్రమంలో తప్పుడు సమాచారం ఇచ్చి మధ్యంతర ఉత్తర్వులు తీసకున్నారంటూ ఆరోపించింది. మొత్తం 14 మంది పిటిషన్‌దారులకు హైకోర్టు రూ.లక్ష చొప్పున అపరాధం విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

Odela 2: మా నాన్నమ్మనుంచి ఓదెల 2లో నాగసాధు పాత్ర పుట్టింది : డైరెక్టర్ సంపత్ నంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments