Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పటం గ్రామస్థులపై హైకోర్టు సీరియస్ - రూ.లక్ష చొప్పున అపరాధం

Webdunia
గురువారం, 24 నవంబరు 2022 (17:28 IST)
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామస్తులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ గ్రామంలో రోడ్డు విస్తరణల పేరుతో పలు గృహాలను కూల్చివేశారు. ఇది పెద్ద వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ వారికి ఊహించని విధంగా షాక్ తగిలింది. 
 
ఇప్పటం గ్రామంలో కూల్చివేతలకు సంబంధించి ముందుగా నోటీసులు ఇచ్చినా.. నోటీసులు ఇవ్వలేదంటూ బాధితులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపైనే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తారంటూ మండిపడింది. ఈ క్రమంలో ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది. 
 
ఈ కేసులో హైకోర్టు గతంలో స్టే ఇవ్వగా, గురువారం ఇరు వర్గాల వాదనలు ఆలకించింది. ఇళ్ల కూల్చివేతలపై తమకు ప్రభుత్వం ముందస్తు నోటీసులు ఇవ్వలేదని పిటిషన్‌దారులు పేర్కొనగా, నోటీసులు ఇచ్చిన తర్వాతే ఆక్రమణలను కూల్చివేశామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపాపారు. 
 
ఈ సందర్భంగా నోటీసులు ఇచ్చింది నిజమేనని హైకోర్టు గుర్తించడంతో ఇప్పటం గ్రామస్థులకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఈ క్రమంలో తప్పుడు సమాచారం ఇచ్చి మధ్యంతర ఉత్తర్వులు తీసకున్నారంటూ ఆరోపించింది. మొత్తం 14 మంది పిటిషన్‌దారులకు హైకోర్టు రూ.లక్ష చొప్పున అపరాధం విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments