Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు పచ్చజెండా

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (14:40 IST)
ఈ నెల 12వ తేదీ నుంచి అమరావతి రాజధాని ప్రాంత రైతులు చేపట్టాదలచిన మహా పాదయాత్రకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. పరిమిత ఆంక్షలతో రైతులు పాదయాత్రను చేసుకోవచ్చని తెలిపింది. అదేసమయంలో పోలీసులకు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రైతులు దరఖాస్తును పరిశీలించి అనుమతి ఇవ్వాలంటూ ఏపీ పోలీసులను కూడా హైకోర్టు ఆదేశించింది. 
 
కాగా, ఈ మహా పాదయాత్ర చేయడం వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పి ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అనుమతి నిరాకరిస్తూ గురువారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఈ నేపథ్యంలో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అమరావతి పరిరక్షణ సమితి తరపున ఈ పిటిషన్ దాఖలైంది. రైతులు వేసిన పిటిషన్‌ను శుక్రవారం మొదటి కేసుగా విచారణకు స్వీకరించి పరిమిత ఆంక్షలతో పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments