90 రోజుల్లో చార్జిషీటు దాఖలు చేయలేదన్న అనంతబాబు.. అయినా నో బెయిల్

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2022 (15:10 IST)
తన వ్యక్తిగత కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. పోలీసులు 90 రోజుల్లో చార్జిషీటు దాఖలు చేయలేదన్న విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించినప్పటికీ కోర్టు మాత్రం అదేం పట్టించుకోకుండా ఆయనకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించడమేకాకుండా, పిటిషన్‌ను కూడా కొట్టివేసింది. 
 
ఏపీలో రాజకీయ దుమారం రేపిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణ ఖైదీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించింది. 
 
ఈ సందర్భంగా అనంతబాబు తరపు న్యాయవాది వాదిస్తూ, పోలీసులు నిర్ణీత 90 రోజుల్లో చార్జిషీటు దాఖలు చేయలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నిబంధన ఆధారంగా తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషిన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు అనంతబాబుకు బెయిల్ మంజూరు చేయకుండా పిటిషన్‌ను కొట్టివేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments