Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజు (హైకోర్టు) లేకుండా న్యాయరాజధాని ఎలా సాధ్యం : హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (11:27 IST)
రాజు లేకుండా అంటే హైకోర్టు లేకుండా కర్నూలులో న్యాయ రాజధాని ఎలా సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాజధాని అమరావతి వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. అదేసమయంలో ఆయన పలు ప్రశ్నలతో పాటు సందేహాలను వ్యక్తం చేశారు.
 
'అసలు న్యాయ రాజధాని అంటే ఏమిటి? పాలన వికేంద్రీకరణ చట్టంలో కర్నూలులోనే హైకోర్టు ఉండాలనే స్పష్టత లేదు. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులో లోకాయుక్త, మానవ హక్కుల సంఘాలను (హెచ్‌ఆర్‌సీ) ఇప్పటికే ఏర్పాటు చేసింది. హైకోర్టు ప్రధాన బెంచ్‌ అమరావతిలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి నోటిఫికేషన్‌ ఇచ్చారు.
 
కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేయనంత వరకు అమరావతి నుంచి హైకోర్టు ఎక్కడికీ పోదు. అలాంటప్పుడు హైకోర్టు లేకుండా కర్నూల్లో న్యాయ రాజధాని ఎలా సాధ్యం? రాజు (హైకోర్టు) లేకుండా రాజధాని ఎలా సాధ్యం? కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నట్లు పాలన వికేంద్రీకరణ చట్టంలో ఉంది.
 
అలాంటి హామీని చట్టంలో పొందుపరచవచ్చా? ప్రభుత్వ నిర్ణయం కర్నూలు, ఇతర ప్రాంతాల మధ్య విభేదాలు తెచ్చే ప్రమాదం ఉంది. అమరావతి ఏర్పాటు విషయంలో ఒకసారి తీసుకున్న నిర్ణయం.. హైకోర్టు ఏర్పాటు విషయంలోనూ వర్తిస్తుందా?’ అని సీజే ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments