Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రభుత్వానికి మరో షాక్.. జీవో 72 కొట్టివేసిన హైకోర్టు

Webdunia
సోమవారం, 14 జూన్ 2021 (13:47 IST)
ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 72ను హైకోర్టు కొట్టేసింది. సింహాచలం వరాహలక్ష్మి నరసింహ స్వామి దేవస్థానానికి, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా సంచయిత గజపతి రాజు నియామకం చెల్లదని కోర్టు స్పష్టం చేసింది. 
 
మాజీ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు వేసిన రిట్ పిటిషన్లపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.. గతంలో మాన్సాస్ ట్రస్టీ, సింహాచల దేవస్థానం చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతి రాజును తొలగిస్తూ.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. ఆ స్థానంలో  సంచయితను నియమించింది. దానికి సబంధించి 72 జీవోను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.  దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అశోక్ గజపతి రాజు న్యాయ పోరాటం చేశారు.
 
అశోక్ గజపతి రాజు రిట్ పిటిషన్లను విచారించిన హైకోర్టు.. సంచయిత దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చింది. తాజా హైకోర్టు ఆదేశాలతో మాన్సాస్  ట్రస్ట్, సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికీ తిరిగి అశోక్ గజపతి రాజు  చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. 
 
తాజా తీర్పుపై సంచయిత గజపతి రాజు సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఆమె తన వాదన నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.. అయితే తాజా తీర్పుపై ఆము ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments