Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోగులను సొంత మనుషుల్లా చూసుకుని వైద్యం అందించాలి. : శ్రీకాంత్ రెడ్డి

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (22:35 IST)
కోవిడ్ కేర్ సెంటర్‌కు వస్తున్న రోగులను సొంతమనుషుల్లా చూసుకుని వైద్యం అందించాలని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సూచించారు. రాయచోటి పట్టణ శివార్లలోని రాజంపేట మార్గంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్‌ను శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడ అందుతున్న వైద్యసేవలు, ఆహారం, పారిశుద్యపు చర్యలు, తదితర సౌకర్యాల కల్పనపై ఆరా తీశారు. 
 
ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి రాయచోటి కోవిడ్ కేర్ సెంటర్‌లో కరోనా బాధితులకు వైద్య సేవలు అందుతున్నాయన్నారు. ఇక్కడ  వైద్యులు, సిబ్బంది  పూర్తి స్థాయిలో షిప్ట్ పద్దతిలో విధులు నిర్వహిస్తున్నారన్నారు. మంచి పోషకాహారాన్ని అందిస్తున్నారన్నారు. 
 
ప్రత్యేక మైన సిబ్బందిచే పారిశుద్యపు చర్యలు  భేషుగ్గా ఉన్నాయన్నారు. ఈ కేంద్రం నందు ఇప్పటికి 6 మంది అడ్మిషన్ అయ్యారన్నారు. ఈ కోవిడ్ కేర్ సెంటర్ నందు 130 పడకలు ఉన్నాయన్నారు. రాయచోటి, పరిసర ప్రాంతాలుకు చెందిన వారెవరైనా వైరస్ బారిన పడిన వారు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని వసతి సౌకర్యాలతో ఈకేంద్రంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జ్వరం, జలుబు, దగ్గు తదితర కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి కోవిడ్ నిర్దారణ రిపోర్ట్ రాకున్నా కానీ వారిని ప్రత్యేక గదులలో ఉంచి వైద్యం అందించాలని శ్రీకాంత్ రెడ్డి వైద్యులకు సూచించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Vamsi: సినిమా బాగుంటే చూస్తారు, రివ్యూర్ల రాతలు వల్లకాదు : నాగవంశీ ఫైర్

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్

ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments