Webdunia - Bharat's app for daily news and videos

Install App

శవాల వద్ద నెత్తురు కూడా తినే సన్నాసులు : : ప్రభుత్వ విప్

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (17:50 IST)
టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణపై ఏపీ ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బండారును ఓ బడుద్ధాయిగా ప్రభుత్వ విప్ అభివర్ణించారు. టీడీపీ నేతలు శవాల వద్ద నెత్తురు కూడా తినే సన్నాసులు అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. 
 
తూర్పు గోదావరి జిల్లాలో అధికార, వైకాపా నేతల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గున మండిపోయేలా వుంది. దీంతో ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఈ క్రమంలో బండారు సత్యనారాయణనను ఉద్దేశించి ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా మాట్లాడుతూ టీడీపీలో బండారు వంటి లుచ్ఛా నాయకులే ఉన్నారు. 
 
అకాల మరణం చెందిన వివాద రహితుడైన మంత్రి గౌతం రెడ్డిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి నీకు సిగ్గులేదా అని ప్రశ్నించారు. బండారూ.. నిన్ను ఈ వ్యాఖ్యలు చంద్రబాబు చేయమన్నాడా? అంటూ నిలదీశారు. 
 
ఇకపోతే యనమల రామకృష్ణుడుకి తునిలో సత్తా లేకే పక్క జిల్లాలోని పత్తా లేని నాయకులను తీసుకొచ్చి మీటింగులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. యనమల ఒక ముసలోడు, ఆ ముసలోడు యువత కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. 
 
సీఎం పెట్టుబడుల గురించి ఒత్తిడి తేవడం వల్లే మంత్రి గౌతం రెడ్డికి గుండెపోటుకు గురయ్యారని, దీనిపై విచారణ జరిపించాలంటూ టీడీపీ నేతల డిమాండ్ చేయడంతో వైకాపా నేతలు ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments