Webdunia - Bharat's app for daily news and videos

Install App

శవాల వద్ద నెత్తురు కూడా తినే సన్నాసులు : : ప్రభుత్వ విప్

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (17:50 IST)
టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణపై ఏపీ ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బండారును ఓ బడుద్ధాయిగా ప్రభుత్వ విప్ అభివర్ణించారు. టీడీపీ నేతలు శవాల వద్ద నెత్తురు కూడా తినే సన్నాసులు అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. 
 
తూర్పు గోదావరి జిల్లాలో అధికార, వైకాపా నేతల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గున మండిపోయేలా వుంది. దీంతో ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఈ క్రమంలో బండారు సత్యనారాయణనను ఉద్దేశించి ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా మాట్లాడుతూ టీడీపీలో బండారు వంటి లుచ్ఛా నాయకులే ఉన్నారు. 
 
అకాల మరణం చెందిన వివాద రహితుడైన మంత్రి గౌతం రెడ్డిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి నీకు సిగ్గులేదా అని ప్రశ్నించారు. బండారూ.. నిన్ను ఈ వ్యాఖ్యలు చంద్రబాబు చేయమన్నాడా? అంటూ నిలదీశారు. 
 
ఇకపోతే యనమల రామకృష్ణుడుకి తునిలో సత్తా లేకే పక్క జిల్లాలోని పత్తా లేని నాయకులను తీసుకొచ్చి మీటింగులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. యనమల ఒక ముసలోడు, ఆ ముసలోడు యువత కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. 
 
సీఎం పెట్టుబడుల గురించి ఒత్తిడి తేవడం వల్లే మంత్రి గౌతం రెడ్డికి గుండెపోటుకు గురయ్యారని, దీనిపై విచారణ జరిపించాలంటూ టీడీపీ నేతల డిమాండ్ చేయడంతో వైకాపా నేతలు ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments