Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప జైలర్ వరుణా రెడ్డిపై బదిలీ వేటు

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (15:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు, జైళ్ళ శాఖల్లో కీలక బదిలీలకు తెరలేచింది. ఇప్పటికే రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌ను బదిలీ చేసిన ఏపీ సర్కారు ఇపుడు కడప జిల్లా జైలర్ వరుణా రెడ్డిని కూడా బదిలీ చేసింది. ఈయనను ఒంగోలు జైలుకు బదిలీ చేసింది. ఒంగోలు జైలర్ ప్రకాశ్‌ను కడప జైలుకు మార్పు చేసింది. 
 
ఇటీవల వరుణా రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మొద్దు శీను జైలులో హత్యకు గురైన సమయంలో కడప జైలర్‌గా వరుణా రెడ్డి ఉన్నారు. ఇపుడు కడప జిల్లా జైల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోని నిందితులు ఉన్నారు. 
 
దీంతో ఈ నిందితులను హతమార్చేందుకు కుట్ర చేస్తున్నారా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. పైగా, వరుణారెడ్డి కడప జైలర్‌గా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తుందని చంద్రబాబు సందేహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వరుణా రెడ్డిని బదిలీ చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

Imanvi: ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ నటి ఇమాన్విని తొలగించండి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments