Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప జైలర్ వరుణా రెడ్డిపై బదిలీ వేటు

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (15:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు, జైళ్ళ శాఖల్లో కీలక బదిలీలకు తెరలేచింది. ఇప్పటికే రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌ను బదిలీ చేసిన ఏపీ సర్కారు ఇపుడు కడప జిల్లా జైలర్ వరుణా రెడ్డిని కూడా బదిలీ చేసింది. ఈయనను ఒంగోలు జైలుకు బదిలీ చేసింది. ఒంగోలు జైలర్ ప్రకాశ్‌ను కడప జైలుకు మార్పు చేసింది. 
 
ఇటీవల వరుణా రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మొద్దు శీను జైలులో హత్యకు గురైన సమయంలో కడప జైలర్‌గా వరుణా రెడ్డి ఉన్నారు. ఇపుడు కడప జిల్లా జైల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోని నిందితులు ఉన్నారు. 
 
దీంతో ఈ నిందితులను హతమార్చేందుకు కుట్ర చేస్తున్నారా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. పైగా, వరుణారెడ్డి కడప జైలర్‌గా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తుందని చంద్రబాబు సందేహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వరుణా రెడ్డిని బదిలీ చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments