Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

16 నుంచి కోర్టుల్లో భౌతిక విచారణలు

16 నుంచి కోర్టుల్లో భౌతిక విచారణలు
, మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (08:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ చాలా మేరకు తగ్గింది. దీంతో రాత్రిపూట కర్ఫ్యూను కూడా ఎత్తివేశారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి కోర్టుల్లో భౌతిక విచారణకు ఏపీ హైకోర్టు సమ్మతించింది. 
 
హైకోర్టుతో పాటు దిగువ కోర్టులు, ట్రైబ్యునళ్లు, న్యాయ సేవాధికార సంస్థ మధ్యవర్తిత్వ కేంద్రాల్లో బుధవారం నుంచి భౌతిక విచారణలు జరుగనున్నాయి. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఏపీ రవీంద్రబాబు ఉత్తర్వులు జారీచేశారు. 
 
కోవిడ్ మూడో దశ అల ప్రభావం కారణంగా జనవరి 17వ తేదీ నుంచి హైకోర్టుతో పాటు దిగువ న్యాయస్థానాల్లో వర్చువల్ విధానంలో విచారణలు జరుగుతున్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకాపా కార్యకర్త వివాహానికి హాజరైన సీఎం జగన్