Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైకాపా కార్యకర్త వివాహానికి హాజరైన సీఎం జగన్

వైకాపా కార్యకర్త వివాహానికి హాజరైన సీఎం జగన్
, మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (08:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తున్నారు. తాడేపల్లి నివాసం విడిది వదిలి రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి చెక్ పెడుతూ వైకాపా కార్యకర్త వివాహానికి ఆయన హాజరై, ప్రతి ఒక్కరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. 
 
విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటరులో వైకాపా కార్యకర్త ప్రశాంత్ వివాహం శరణ్య అనే యువతితో జరిగింది. ఈ వివాహానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్‌ను ఆహ్వానించారు. 
 
ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి ఆయన హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను వైకాపా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ సీఎంవో నుంచి ప్రవీణ్ ప్రకాష్ ఔట్