ఏపీలో పాఠశాల విద్యార్థుల కోసం సరికొత్త పథకం..

ఠాగూర్
గురువారం, 7 నవంబరు 2024 (14:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థుల కోసం సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు ప్రత్యేక కిట్‌లను అందజేయాలని నిర్ణయించింది. ఇందుకోసం యేటా రూ.953.71 కోట్లు వెచ్చించనున్నట్లు పేర్కొంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. 
 
ఈ పథకానికి సంబంధించి పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వ వాటా కింద రూ.175.03 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.778.68 కోట్లు ఖర్చు చేసి విద్యార్థులకు కిట్‌లు అందజేయనుంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదివే 35,94,774 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని అధికారులు తెలిపారు.
 
ఈ కిట్‌లో పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, నోటు బుక్స్, బెల్ట్, బూట్లు, బ్యాగ్, డిక్షనరీ, మూడు జతల యూనిఫాంలు ఉంటాయి. అలాగే, ఒక్కో కిట్‌కు కోసం ప్రభుత్వం రూ.1,858 ఖర్చు చేయనుంది. యూనిఫాం తయారీకి సంబంధించి 8వ తరగతి వరకు రూ.120, తొమ్మిది, పదో తరగతి విద్యార్థుల యూనిఫాంలకు రూ.240 చొప్పున ప్రభుత్వం కుట్టుకూలీ చెల్లించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments