Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెనక్కి తగ్గి సర్దుకుపోయిన ఏపీ ఉద్యోగులు ... సమ్మె విరమణ

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (09:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మెట్టుదిగారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీతో జరిగిన చర్చల్లో సర్దుకునిపోయారు. దీంతో ఆదివారం అర్థరాత్రి నుంచి చేపట్టాల్సిన నిరవధిక సమ్మెను విరమించుకున్నారు. ఈ విషయాన్ని శనివారం పీఆర్సీ సాధన సమితి నేతలు అధికారికంగా ప్రకటించారు. అయితే, ఉపాధ్యాయులు మాత్రం గుర్రుగా ఉన్నారు. తమకు అన్యాయం జరిగిందంటూ పీఆర్సీ సాధన సమితి ఉద్యమ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నిరసనను తెలిపేలా శనివారం నిర్వహించిన మీడియా సమావేశాన్ని బహిష్కరించారు. 
 
ఈ సందర్భంగా పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులు ఉమ్మడి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమ్మె నోటీసులో పేర్కొన్న అన్ని అంశాలపై ప్రభుత్వం నుంచి స్పందన వచ్చిందని పేర్కొన్నారు. హెచ్ఆర్ఏ విషయంలో ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య అవగాహన కలిగింది. 
 
ప్రభుత్వానికి ఉద్యోగుల ప్రేమ ఏంటో నిరూపితమైంది. ఐదు డీఏలను ఒకేసారి ఇవ్వడం చాలా గొప్ప నిర్ణయం అని పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి వెంకట్రామిరెడ్డి అన్నారు. పీఆర్సీ జీవోల జారీ తర్వాత అన్ని అంశాలు మరుగునపడ్డాయి. ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సమ్మెకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నందుకు ధన్యవాదాలు అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments