Webdunia - Bharat's app for daily news and videos

Install App

చడీచప్పుడు లేకుండా ఉద్యోగుల జీపీఎఫ్ డబ్బులు విత్‌డ్రా

Webdunia
గురువారం, 30 జూన్ 2022 (14:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు నవ్వులపాలైంది. ఉద్యోగులకు చెందిన జీపీఎఫ్ డబ్బులను చడీచప్పుడు లేకుండా విత్‌డ్రా చేసింది. ఉద్యోగుల ఖాతాల నుంచి వారికి తెలియకుండా ఏకంగానే రూ.800 కోట్లను మాయం చేసింది. ఈ బాధితుల్లో 90 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. రూ.800 కోట్ల మేరకు ప్రభుత్వం విత్‌డ్రా చేసిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. జీపీఎఫ్ ఖాతాల నుంచి నగదు విత్ డ్రా చేయడాన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. 
 
ఇదే అంశంపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ, ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు డ్రా అయిపోతున్నాయి. గతంలో ఇదే తరహాలో డబ్బులు డ్రా అయితే కేసు నమోదుచేస్తామని హెచ్చరిస్తే తిరిగి డబ్బులు జమ చేశారు. జీపీఎఫ్ స్లిప్పులను డౌన్‌లౌడ్ చేసుకుని చూస్తే డబ్బులు విత్ డ్రా అయినట్టు స్పష్టంగా తెలుస్తుందన్నారు. 
 
తన ఖాతా నుంచే ఏకంగా రూ.80 వేల వరకు డ్రా అయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో చాలా మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులను ప్రభుత్వం విత్ డ్రా చేసిందని ఆయన వాపోయారు. గతంలో జమ చేసిన డీఏ బకాయిలను ప్రభుత్వం తీసేకుంది. ఇపుడు రూ.800 కోట్లను 90 వేల మంది ఉద్యోగుల ఖాతాల నుంచి ప్రభుత్వం డ్రా చేసింది అని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments