ఏబీ వెంకటేశ్వర రావుకు షాకిచ్చిన ఏపీ సర్కారు.. షోకాజ్ నోటీసు జారీ

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (12:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ నిఘా విభాగ అధిపతి ఏబీ వెంకటేశ్వర రావుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కారు షాకిచ్చింది. ఆయనకు షోకాజ్ నోటీసును పంపించింది. ఆలిండియా సర్వీస్ రూల్స్‌లోని 6వ నిబంధనను పాటించ లేదని ఆ నోటీసుల్లో పేర్కొంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పెగాసెస్ సాఫ్ట్‌వేర్ అంశంతో పాటు ఆయన్ను సస్పెండ్ చేసిన అంశంపై మార్చి 21వ తేదీన వెంకటేశ్వర రావు మీడియాతో మాట్లాడారు. ఈ ప్రెస్మీట్‌పై ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మీడియాతో మాట్లాడిన అంశంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ షోకాజ్ నోటీసు జారీచేశారు. 
 
ఇందులో ప్రభుత్వ అనుమతి లేకుండా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయడం, ఆలిండియా సర్వీస్ రూల్స్‌లోని 6వ నిబంధనను పాటించకుండా మీడియా సమావేశాన్ని నిర్వహించారని పేర్కొన్నారు. ఈ నోటీసు అందుకున్న వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో తగిన  చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments