Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏబీ వెంకటేశ్వర రావుకు షాకిచ్చిన ఏపీ సర్కారు.. షోకాజ్ నోటీసు జారీ

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (12:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ నిఘా విభాగ అధిపతి ఏబీ వెంకటేశ్వర రావుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కారు షాకిచ్చింది. ఆయనకు షోకాజ్ నోటీసును పంపించింది. ఆలిండియా సర్వీస్ రూల్స్‌లోని 6వ నిబంధనను పాటించ లేదని ఆ నోటీసుల్లో పేర్కొంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పెగాసెస్ సాఫ్ట్‌వేర్ అంశంతో పాటు ఆయన్ను సస్పెండ్ చేసిన అంశంపై మార్చి 21వ తేదీన వెంకటేశ్వర రావు మీడియాతో మాట్లాడారు. ఈ ప్రెస్మీట్‌పై ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మీడియాతో మాట్లాడిన అంశంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ షోకాజ్ నోటీసు జారీచేశారు. 
 
ఇందులో ప్రభుత్వ అనుమతి లేకుండా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయడం, ఆలిండియా సర్వీస్ రూల్స్‌లోని 6వ నిబంధనను పాటించకుండా మీడియా సమావేశాన్ని నిర్వహించారని పేర్కొన్నారు. ఈ నోటీసు అందుకున్న వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో తగిన  చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments