Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా రంగు పోతోంది... ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీకి సిద్ధం

ఠాగూర్
శుక్రవారం, 11 అక్టోబరు 2024 (13:18 IST)
గత వైకాపా ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికు చెందిన వైకాపా రంగులతో కూడిన రేషన్ కార్డులను జారీచేశారు. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం స్థానంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రభుత్వం మారి నాలుగు నెలలు కావొస్తున్నప్పటికీ వైకాపా రంగులతో ఉన్న పాత రేషన్ కార్డులపైనే సరకులను పంపిణీ చేస్తున్నారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాత కార్డులను తొలగించి కొత్త కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం భావించింది. వాటి స్థానంలో కొత్త కార్డులు ఇవ్వడానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. 
 
కొత్త కార్డులకు సంబంధించి అదికారులు పలు డిజైన్లను రూపొందించి, వాటిని పరిశీలిస్తున్నారు. లేత పసుపు రంగులో ఉండే కార్డుపై రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నాన్ని ముద్రించిన డిజైన్‌ను ప్రభుత్వం ఆమోదం కోసం అధికారులు పంపించారు. దీంతో పాటు మరికొన్ని డిజైన్లను కూడా ప్రభుత్వానికి పంపించారు. వీటిలో ఏదొ ఒక డిజైన్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఆ రంగుతో డిజైన్ చేసిన కొత్త కార్డులను పంపిణీ చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఔరంగజేబు పాత్రలో ఒదిగిపోయిన బాబీ డియోల్ : దర్శకుడు జ్యోతి కృష్ణ

Naresh: అల్లరి నరేష్ కథానాయకుడిగా ఆల్కహాల్ టైటిల్ ఖరారు

శ్రీహరి కొడుకు ధనుష్ హీరోగా థాంక్యూ డియర్ చిత్ర టీజర్ లాంచ్ చేసిన వినాయక్

Ram: రామ్, ఉపేంద్ర, సత్య పై రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షెడ్యూల్

తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్, కల్ట్ సీక్వెల్ ENE రిపీట్ అనౌన్స్‌మెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం