Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా రంగు పోతోంది... ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీకి సిద్ధం

ఠాగూర్
శుక్రవారం, 11 అక్టోబరు 2024 (13:18 IST)
గత వైకాపా ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికు చెందిన వైకాపా రంగులతో కూడిన రేషన్ కార్డులను జారీచేశారు. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం స్థానంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రభుత్వం మారి నాలుగు నెలలు కావొస్తున్నప్పటికీ వైకాపా రంగులతో ఉన్న పాత రేషన్ కార్డులపైనే సరకులను పంపిణీ చేస్తున్నారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాత కార్డులను తొలగించి కొత్త కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం భావించింది. వాటి స్థానంలో కొత్త కార్డులు ఇవ్వడానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. 
 
కొత్త కార్డులకు సంబంధించి అదికారులు పలు డిజైన్లను రూపొందించి, వాటిని పరిశీలిస్తున్నారు. లేత పసుపు రంగులో ఉండే కార్డుపై రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నాన్ని ముద్రించిన డిజైన్‌ను ప్రభుత్వం ఆమోదం కోసం అధికారులు పంపించారు. దీంతో పాటు మరికొన్ని డిజైన్లను కూడా ప్రభుత్వానికి పంపించారు. వీటిలో ఏదొ ఒక డిజైన్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఆ రంగుతో డిజైన్ చేసిన కొత్త కార్డులను పంపిణీ చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం