Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూల్ ఫీజు : ప్రైవేట్ స్కూల్స్‌కు ఏపీ సర్కారు ఆర్డర్స్... తేడా వస్తే..

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (18:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ తర్వాత కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంకానుంది. అంటే జూన్ రెండో వారం నుంచి పాఠశాలలు ప్రారంభంకావాల్సివుంది. అపుడు విద్యార్థుల నుంచి ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఫీజు దండకాలకు పాల్పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ముందుగా గ్రహించిన ఏపీ సర్కారు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 
 
లాక్‌డౌన్ తర్వాత ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో తొలి విడత ఫీజు మాత్రమే వసూలు చేయాలని స్పష్టంచేసింది. అది కూడా, తొలి విడత ఫీజును రెండు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించాలని పేర్కొంది. ఫీజు చెల్లించలేదన్న కారణంతో ఏ విద్యార్థి ప్రవేశాన్ని నిరాకరించరాదంటూ ఈ మేరకు పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అదీకూడా 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి గత యేడాది అంటే 2019-20 విద్యా సంవత్సరంలో వసూలు చేసిన ఫీజునే వసూలు చేయాలని కోరింది.
 
కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే విధంగా ఆదేశాలు జారీచేసింది. కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని స్పష్టంగా చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇపుడు ఈ కోవలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments