Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగులకు షాకిచ్చిన ఏపీ సర్కారు... కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలివ్వాలంటూ ఆర్డర్

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (12:27 IST)
ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తేరుకోలోని షాకిచ్చింది. కొత్త వేతన స్కేలు ప్రకారం వేతనాలు ఇవ్వాలంటూ తాజాగా ఆదేశాలు జారీచేసింది. అంటే.. ఇటీవల ఏపీ సర్కారు ప్రకటించిన కొత్త పే రివిజన్ స్కేల్ (పీఆర్సీ) ప్రకారమే జీతాలు ఇవ్వనుంది. దీంతో వచ్చే నెల నుంచి ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారం వేతనాలు అందనున్నాయి. 
 
నిజానికి ఈ పీఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వాన్ని నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పటికే తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇపుడు తమ ఆందోళనను మరింత ఉధృతం చేయాలని వారు నిర్ణయించారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల ఆందోళలను కనీసం పట్టించుకోకుండా కొత్త వేతనాన్ని వచ్చే నుంచి ఇవ్వాలంటూ ఉత్తర్వులు జారీ చేయడంతో వారు మరింత ఆగ్రహానికి లోనవుతున్నారు. 
 
మరోవైపు, ప్రభుత్వం జారీచేసిన పీఆర్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తంగా మారుతోంది. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి వారిని ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దించి అరెస్టులు చేయిస్తుంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments