Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ప్రభావం, దీపావళి టపాసులపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (09:50 IST)
కరోనా మహమ్మారి ఇంకా అదుపులోకి రాని నేపథ్యంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకుంటున్న దీపావళిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు ఆంక్షలను విధించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు మేరకు ఈ ఆంక్షలు విధిస్తున్నామని తెలిపింది.
 
శనివారం నాడు రాత్రి పూట కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాసులు పేల్చుకోవాలని తెలిపింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాకాయలను కాల్చేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అవి కూడా పర్యావరణానికి మేలు కలిగించే గ్రీన్ క్రాకర్స్ మాత్రమే పేల్చాలని తెలిపింది.
 
రాష్ట్రంలో కరోనా బాధితులు, పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్ననట్లు తెలిపింది. ఇక టపాకాయలు విక్రయించే షాపుల మధ్య దూరం తప్పనిసరి అని తెలిపింది. కొనుగోలుదార్లను కూడా 6 అడుగుల భౌతికదూరం పాటించేలా చూడాల్సిన బాధ్యత షాపు యాజమాన్యానికి ఇచ్చింది. ఈ షాపుల వద్ద పేలుడు స్వభావం కలిగిన శానిటైజర్లను వాడరాదని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments