Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సర్కార్ కీలక నిర్ణయం, పెళ్లిళ్లు, సభలు సమావేశాలకు లిమిట్ అతిక్రమిస్తే..

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (11:04 IST)
కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వివాహాలు, ధార్మిక సభలు, సమావేశాలకు హాజరయ్యే వారి సంఖ్యకు పరిధి నిర్దేశిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
 
ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. గరిష్టస్థాయిలో 150 మందికి మాత్రమే ఈ తరహా సమూహ కార్యక్రమాల్లో హాజరయ్యేందుకు అనుమతి ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
 
సమూహ కార్యక్రమాల సందర్భంగా మాస్కులు ధరించటం, శానిటైజేషన్ లాంటి చర్యలు తప్పనిసరి చేసింది. ఆయా కార్యక్రమాల్లో భౌతిక దూరం ఉండేలా సీట్ల మధ్య ఖాళీ వదలాలని సూచించింది.
 
సీట్లు లేని చోట్ల మనిషికి, మనిషికి మధ్య కనీసం ఐదడుగులు దూరం ఉండేలా చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించింది.
 
సామూహిక కార్యక్రమాల్లో నిబంధనల ఉల్లంఘనలు జరిగితే విపత్తు నిర్వహణా చట్టం కింద, ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయనున్నట్టు జగన్ సర్కార్ స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments