Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతి సెలవులను కుదించిన సీఎం జగన్ ప్రభుత్వం

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (09:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సెలవులను ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం కుదించింది. ఆ ప్రకారంగా ఈ యేడాది సంక్రాంతి సెలవులు ఈ నెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మాత్రమే కొనసాగుతాయని రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
మొత్తం 8 రోజుల పాటు సెలవులు ఉండేలా అకడమిక్ క్యాలెండర్ పనిదినాలను సర్దుబాటు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. కరోనా కారణంగా ఇప్పటికీ స్కూళ్లు పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదన్న సంగతి తెలిసిందే. 
 
తొలుత పండగ దినాలను మాత్రమే సెలవులుగా ఇవ్వాలని భావించినా, సంక్రాంతి ప్రాధాన్యత, టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సెలవులను పెంచారు.
 
కాగా, 10వ తేదీ ఆదివారం, 11న అమ్మఒడి కార్యక్రమం ఉన్నందున హాఫ్ డే వర్కింగ్ డేను ప్రకటించిన అధికారులు, ఆపై 17 వరకూ సెలవుల తర్వాత, 18న పాఠశాలలు తిరిగి తెరచుకుంటాయని స్పష్టం చేశారు. 
 
ఇదేసమయంలో 21 నుంచి జరగాల్సిన 7, 8 తరగతుల ఫార్మేటివ్ పరీక్షలను ఫిబ్రవరి 8కి మార్చినట్టు కూడా అధికారులు వెల్లడించారు. విద్యార్థుల సిలబస్ పూర్తి కాలేదని ఉపాధ్యాయులు పేర్కొన్న నేపథ్యంలోనే పరీక్షలను వాయిదా వేస్తున్నామని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి డైరెక్టర్ బి. ప్రతాప్ రెడ్డి వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments