Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అమరావతి' పేరు వినిపించకుండా చేయడమే లక్ష్యమా? పేరు మార్పు!!

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (08:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డికి అమరావతి అంటే ఏమాత్రం గిట్టనట్టు, రుచించినట్టు కనిపించడం లేదు. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేశారు. ఆ తర్వాత రాజధాని కోసం ఆ ప్రాంతానికి రైతులు ఏకంగా 33 వేల ఎకరాల భూమిని ఉచితంగా ఇచ్చారు. ఇదంతా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది. 
 
కానీ, రాష్ట్ర సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజధానిని మూడు ముక్కలు చేయాలని భావించారు. అందులో ఓ భాగం విశాఖపట్ణం మరో భాగం అమరావతి, మూడో ముక్కను కర్నూలుకు తరలించాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం సీఎం కుర్చీలో కూర్చొన్నప్పటి నుంచి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ, కోర్టులు కలిగిస్తున్న ఆటంకాల వల్ల ఆయన ఆటలు సాగడం లేదు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరును ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌గా మారుస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టనున్న మెట్రో ప్రాజెక్టుల సౌలభ్యం కోసమే పేరు మార్చినట్టు ఈ సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది.
 
విశాఖపట్టణంలో తలపెట్టిన మెట్రోకు కూడా అమరావతి పేరే ఉండటంతో ప్రాజెక్టు పేరును మార్చినట్టు వివరించింది. గతంలో నాగ్‌పూర్ మెట్రో ప్రాజెక్టు పేరును మహారాష్ట్ర మెట్రో రైల్ ప్రాజెక్టు లిమిటెడ్‌గా మార్చినట్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది. అలాగే, లక్నో మెట్రో ప్రాజెక్ట్ పేరును ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లిమిటెడ్‌గా మార్చారని ఆ జీవోలో విరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments