Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టును తాకిన కరోనా.. జ్యూడీషియల్ విభాగ ఉద్యోగికి వైరస్

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (08:50 IST)
కరోనా వైరస్ ఇపుడు సుప్రీంకోర్టునూ తాకింది. ఈ అత్యున్నత న్యాయస్థానంలోని జ్యూడీషియల్ విభాగంలో పని చేసే ఓ ఉద్యోగికి ఈ వైరస్ సోకింది. ఈ నెల 16వ తేదీన ఆయన విధులకు హాజరయ్యాడు. ఆ తర్వాత ఆయనలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో ఆయనో పాటు.. మరో ఇద్దరు రిజిస్ట్రార్లను సెల్ఫ్ క్వారంటైన్‌కు తరలించారు. 
 
కరోనా వైరస్ దేశంతో పాటు... ప్రపంచాన్ని ఓ ఊపు ఊపుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే పలు రాష్ట్రాలను కుదిపేసిన ఈ వైరస్ ఇప్పటికే అనేక ప్రభుత్వ విభాగాల్లో పని చేసే సిబ్బందికి సోకింది. కేంద్ర మంత్రులు పేషీల్లో పని చేసే సిబ్బందికి కూడా సోకింది. ఇపుడు సుప్రీంకోర్టు ఉద్యోగికి ఈ వైరస్ సోకింది. 
 
సుప్రీంకోర్టు జుడీషియల్ విభాగంలో పనిచేసే ఉద్యోగికి కరోనా సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. ఈ నెల 16న విధులకు హాజరైన ఆయన ఆ తర్వాత రెండు రోజులపాటు జ్వరంతో బాధపడడంతో కరోనా పరీక్షలు నిర్వహించారు. సోమవారం వచ్చిన పరీక్షా ఫలితాల్లో ఆయనకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. 
 
దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించిన అధికారులు.. ఆయనతో సన్నిహితంగా మెలిగిన ఇద్దరు రిజిస్ట్రార్లను సెల్ఫ్ క్వారంటైన్‌కు పంపారు. అలాగే, 16వ తేదీ నుంచి విధులకు హాజరవుతున్న ఉద్యోగులందరికీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments