Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టును తాకిన కరోనా.. జ్యూడీషియల్ విభాగ ఉద్యోగికి వైరస్

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (08:50 IST)
కరోనా వైరస్ ఇపుడు సుప్రీంకోర్టునూ తాకింది. ఈ అత్యున్నత న్యాయస్థానంలోని జ్యూడీషియల్ విభాగంలో పని చేసే ఓ ఉద్యోగికి ఈ వైరస్ సోకింది. ఈ నెల 16వ తేదీన ఆయన విధులకు హాజరయ్యాడు. ఆ తర్వాత ఆయనలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో ఆయనో పాటు.. మరో ఇద్దరు రిజిస్ట్రార్లను సెల్ఫ్ క్వారంటైన్‌కు తరలించారు. 
 
కరోనా వైరస్ దేశంతో పాటు... ప్రపంచాన్ని ఓ ఊపు ఊపుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే పలు రాష్ట్రాలను కుదిపేసిన ఈ వైరస్ ఇప్పటికే అనేక ప్రభుత్వ విభాగాల్లో పని చేసే సిబ్బందికి సోకింది. కేంద్ర మంత్రులు పేషీల్లో పని చేసే సిబ్బందికి కూడా సోకింది. ఇపుడు సుప్రీంకోర్టు ఉద్యోగికి ఈ వైరస్ సోకింది. 
 
సుప్రీంకోర్టు జుడీషియల్ విభాగంలో పనిచేసే ఉద్యోగికి కరోనా సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. ఈ నెల 16న విధులకు హాజరైన ఆయన ఆ తర్వాత రెండు రోజులపాటు జ్వరంతో బాధపడడంతో కరోనా పరీక్షలు నిర్వహించారు. సోమవారం వచ్చిన పరీక్షా ఫలితాల్లో ఆయనకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. 
 
దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించిన అధికారులు.. ఆయనతో సన్నిహితంగా మెలిగిన ఇద్దరు రిజిస్ట్రార్లను సెల్ఫ్ క్వారంటైన్‌కు పంపారు. అలాగే, 16వ తేదీ నుంచి విధులకు హాజరవుతున్న ఉద్యోగులందరికీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments