Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతీయ స్థాయి యువ పార్లమెంట్‌కు హాజరైన ముగ్గురు బాలికలు

Webdunia
మంగళవారం, 19 జనవరి 2021 (20:23 IST)
కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ రాష్ట్ర నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంద్రప్రదేశ్ గుంటూరు వారిచే నిర్వహించిన రాష్ట్ర స్థాయి జాతీయ యువ పార్లమెంట్ పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపిక కాబడి ఈ నెల 11, 12 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్ నందు నిర్వహించిన జాతీయ యువ పార్లమెంట్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధిలుగా పాల్గొన్న కుమారి జాలాది రిషిత (విజయవాడ), కుమారి ఎస్. కోమలి సాయి శివ రాణి(ఏలూరు), కుమారి డి. శ్రీలక్ష్మీ (కాకినాడ)లను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ కమిషనర్ శ్రీమతి నాగరాణి తమ కార్యాలయం నందు అభినందనలు అందచేశారు. 
 
మంగళవారం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ముందు ముందు మరిన్ని ఉన్నత స్థానాలు పొంది రాష్ట్రానికి మంచి పేరు తేవాలని కోరారు. యువత సామాజిక సేవా, యువజనోత్సవ కార్యక్రమల్లో భాగస్వామ్యం అవ్వాలని పేర్కొన్నారు. 
 
ఈ కార్యక్రమంలో నెహ్రు యువ కేంద్రం సంఘటన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంచాలకులు రాచురి వెంకటేశం, జిల్లా యువ అధికారి సుంకర రాము, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments