Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ప్రభుత్వ పనితీరు బాగోలేదు : మంత్రి పేర్ని నాని అసహనం

Webdunia
బుధవారం, 19 జులై 2023 (17:23 IST)
వైకాపాలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి పేర్ని నాని సొంత ప్రభుత్వంపై అసహనం వ్యక్తంచేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా, జిల్లా పరిషత్ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ గైర్హాజరయ్యారు. దీంతో ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చింది. కలెక్టర్‌పై మండిపడ్డారు. నియంతలా వ్యవహరించవద్దంటూ హెచ్చరించారు. బరితెగింపుతనం ఏ ఒక్క అధికారికి మంచిదికాదంటూ ఆయన విమర్శలు గుప్పించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ సమావేశం ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఇందులో కలెక్టర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా హాజరుకాలేదు. దీంతో మాజీ మంత్రి పేర్ని నానికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇంకోసారి కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు సమావేశానికి రాకుంటే ముఖ్యమంత్రి జగన్ ఇంటి ముందు నిరసన కార్యక్రమం చేపడుతామని పేర్కొంటూ కలెక్టర్‌కు లేఖ రాయాలని జడ్పీ ఛైర్ పర్సన్‌కు ఆయన సూచించారు. 
 
జిల్లా పరిషత్ సమావేశాలకు హాజరయ్యే ఉద్దేశ్యం కలెక్టర్‌కు లేదా అని ప్రశ్నించారు. వ్యవస్థలను లెక్కచేయకపోవడం సరికాదని, నియంతలా వ్యవహరించవద్దని సూచించారు. బరితెగింపుతనం ఏ స్థాయి అధికారికి కూడా మంచిదికాదన్నారు. మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. సొంత ప్రభుత్వ అధికారుల తీరుపైనే ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments