జగన్‌కు ఓటు వేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నా : మాజీ మంత్రి డీఎల్

Webdunia
ఆదివారం, 17 సెప్టెంబరు 2023 (10:17 IST)
గత ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేసినందుకు తన చెప్పుతో తాను కొట్టుకుంటున్నానని ఏపీ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేయడం దురదృష్టకరమన్నారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అరెస్టుపై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి స్పందిస్తూ, 'జగన్‌కు ఓటేసిందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. కానీ అలా కొట్టుకోలేను. చంద్రబాబు అరెస్టు దురదృష్టకరం. ఇది పూర్తిగా జగన్ కక్షసాధింపు చర్య' అని అన్నారు. 
 
'చంద్రబాబు మాజీ ముఖ్య మంత్రి అని కూడా చూడకుండా నంద్యాలలో అరెస్టు చేస్తే 150కి.మీ. దూరంలోని విజయవాడ కోర్టులో పెట్టడం దుర దృష్టకరం. చార్జిషీటులో పేరు లేకుండా, సాక్ష్యాధారాలు చూపకుండా అరెస్టు చేశారు. ఇంతటి ఘోరమైన పాలన నా జీవితంలో చూడలేదు. ఏసీబీ కోర్టు జడ్జి చంద్రబాబుకు రిమాండ్ ఇచ్చి ఉండకూడదు. ఆమె కడపలో కూడా పనిచేశారు. ఇలాంటి తీర్పు ఎందుకిచ్చారో అర్థం కావడం లేదు. నాకు తెలిసి జ్యుడీషియరీలో ఇలాంటి తీర్పు ఇదే ప్రథమం. రాబోయేకాలంలో డబ్బుకు కక్కుర్తి పడకుండా మీ జీవితాలు బాగుపడేలా చేసేవారికి ప్రజలు ఓట్లు వేయాలి' అని పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments