Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆర్ఆర్ఆర్' ప్రాణాలు తీసేందుకే జైలుకు తరలింపు : అమర్నాథ్ రెడ్డి

Webdunia
సోమవారం, 17 మే 2021 (11:08 IST)
వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రాణాలు తీసేందుకే జైలుకు తరలించాలని మాజీ మంత్రి, టీడీపీ నేత అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు. ఎంపీకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? అంటూ ఆయన నిలదీశారు. 
 
ఎంపీ రఘురామ అరెస్టుపై ఆయన మాట్లాడుతూ, ఏపీ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం తప్ప ఎక్కడా రూల్ ఆఫ్ లా లేదు. జగన్ రెడ్డి అండ్ కో అవినీతిని ప్రశ్నించిన వారి ప్రాణాలను తీయడానికి సైతం వెనుకాడబోమని వైసీపీ చర్యలు స్పష్టం చేస్తున్నాయి. 
 
పోలీసులు కొట్టిన దెబ్బలకు రఘురామకృష్ణంరాజుకు సరైన వైద్యం అందించాలని కోర్టు ఆదేశించినా పట్టింసుకోవడం లేదు. రఘురామకృష్ణంరాజు ప్రాణాలను తీసేందుకే జైలుకు తరలించారు. న్యాయస్థానం ఆదేశాలను కూడా లెక్కచేసే పరిస్థితి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
రమేష్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించకుండా రఘురామకృష్ణంరాజును జైలుకు తరలించడం పట్ల అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఆయన ప్రాణానికి ఏదైనా హాని జరిగితే సీఎందే బాధ్యత. జగన్ రెడ్డి అరాచక పాలనను ప్రజలు, మేధావులు నిరసించాలి. 
 
రాష్ట్రంలో ప్రజలతో ఎన్నికైన ఎంపీకే రక్షణ లేనప్పుడు సామాన్యులకు ఏం ఉంటుంది? ప్రభుత్వ లోపాలను ఎవరూ ప్రశ్నించకూడదా? నియంత పాలనకు ప్రజలు చరమగీతం పాడతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Love Jatara: అంకిత్ కొయ్య, మానస చౌదరి జంటగా లవ్ జాతర

కన్నప్ప మూవీ రివ్యూ- కథ మారింది-కల్పితం: నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం వుంది!

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments