Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి వ్యాపారులపై దాడులు చేస్తారా? చంద్రబాబు ఆగ్రహం

Webdunia
శనివారం, 21 మే 2022 (11:51 IST)
టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి అమ్మేవారిపై దాడులు చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ఆయన ఉద్దేశ్యపూర్వకంగా చేసినవి కాదు... టంగ్ స్లిప్ కావడంతో ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. 
 
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆయన టీడీపీ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో గంజాయికి ఎక్కువ మంది బానిసలవుతున్నారన్నారు. గుంటూరులో యువకులు గంజాయి మత్తులో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. ఇలాంటి మత్తు పదార్థాల నుంచి యువతను కాపాడుకోవాలన్నారు. 
 
మరోవైపు, ఇక పార్టీని ఈసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నానని.. ప్రధానంగా 40 శాతం సీట్లు యువతకు కేటాయిస్తానని.. కొత్తగా వచ్చేవారికి అవకాశమిస్తానన్నారు. తన వయసు 72 ఏళ్లయినా మీకోసం 27 ఏళ్ల కుర్రాడిలా పనిచేస్తానని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments