Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి పుష్ప శ్రీవాణిపై కులవివాదం

Webdunia
శనివారం, 5 అక్టోబరు 2019 (11:39 IST)
ఏపీ ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణిని మరోసారి కులవివాదం చుట్టుముట్టింది. ఆమె ఎస్టీ కాదంటూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం న్యాయ సలహాదారు రేగు మహేశ్‌, అఖిల భారత దళిత హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మణిసింగ్‌ పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజుకు ఫిర్యాదు చేశారు. 
 
పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెంలో జన్మించిన పుష్ప శ్రీవాణి గిరిజన వ్యక్తి కాదని.. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న విధంగా ఆమెది కొండదేవర తెగ కాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలంటూ జిల్లా పరిశీలన కమిటీ విచారణకు కలెక్టర్‌ ఆదేశించినట్లు సమాచారం.
 
మరోవైపు ఈ వివాదంపై పుష్పశ్రీవాణి స్పందించారు. 2008 నుంచే ఈ వివాదం ఉందని.. 2014లోనూ తెదేపా ఇదే విధంగా ఫిర్యాదు చేసిందన్నారు. ఇప్పుడు కూడా ఆ పార్టీకి చెందిన వ్యక్తులే ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. ప్రతిసారి ఈ కేసు కోర్టుల్లో వీగిపోయిందని.. ఈ దఫా కూడా న్యాయమే గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments