Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.లక్షల్లో వేతనాలు తీసుకునే ప్రభుత్వ టీచర్ల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు?

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (18:42 IST)
లక్షల్లో వేతనాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు ఎక్కడ చదువుతున్నారంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ప్రశ్నించారు. టీచర్లు వారి పిల్లలను వారే పాఠాలు చెప్పే స్కూళ్ళలో ఎందుకు చదివించడం లేదని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం టీచర్ల పిల్లలు మాత్రం ప్రైవేటు స్కూళ్ళలలో విద్యాభ్యాసం చేస్తుంటారని అన్నారు. 
 
ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారు. వచ్చే నెల 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. 
 
ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఉద్యోగులు సహకరించాలని ఆయన సూచించారు. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, వారు ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. సీఎం జగన్ గురించి టీచర్లు వాడిన భాష సరైనది కాదన్నారు. టీచర్లు వారి పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళలో చదివిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పరువు రెండో సీజన్ కోసం ఎదురుచూస్తున్నా: మెగాస్టార్ చిరంజీవి

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో శ్రీరెడ్డి పెళ్లి.. రెండేళ్ల సహజీవనం తర్వాత?

‘కల్కి 2898 AD’ కాశీ, కాంప్లెక్స్‌, శంబాలా అనే త్రీ వరల్డ్స్ మధ్య నడిచే కథ : డైరెక్టర్ నాగ్ అశ్విన్

వరుణ్ తేజ్ మట్కా న్యూ లెన్తీ షెడ్యూల్ హైదరాబాద్ RFCలో ప్రారంభం

అహో! విక్రమార్క' అంటూ హీరోగా వస్తున్న దేవ్ గిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బాదం పిసిన్‌ను మహిళలు ఎందుకు తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments