Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి రైతుల పాదయాత్ర చేస్తే శాంతిభద్రతలకు విఘాతం!

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (10:25 IST)
అమరావతి రైతులు ఈ నెల 12వ తేదీన మహాపాదయాత్ర చేయతలపెట్టారు. ఈ రైతులు పాదయాత్ర చేయడం వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సెలవిచ్చారు. ఈ సాకుతో రైతుల పాదయాత్రకు అనుమతి లేదంటూ ఆయన గురువారం అర్థరాత్రి జీవో ఒకటి జారీచేశారు. 
 
ఈ పాదయాత్రలో 20 మంది పాల్గొంటారని చెప్పారని, ఒకవేళ ఈ సంఖ్య పెరిగితే ఒక్కో బృందంలో 200 మంది చొప్పున వేర్వేరుగా యాత్ర చేపడుతాయని చెప్పినప్పటికీ శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న ఉద్దేశ్యంతో ఈ పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తున్నట్టు పేర్కొన్నారు. పైగా, యాత్ర సాగే జిల్లాల పోలీసుల నుంచి నుంచి అభిప్రాయాలు కూడా సేకరించిన మీదటే ఈ ఉత్తర్వులు జారీచేసినట్టు డీజీపీ అందులో పేర్కొన్నారు. 
 
గత యేడాది అమరావతి నుంచి తిరుపతి వరకు రైతులు చేపట్టిన పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ పాదయాత్ర సందర్భంగా తాము పెట్టిన షరతులన్నింటినీ ఉల్లంఘించారని గుర్తు చేసిన డీజీపీ.. ఈ పాదయాత్రా సమయంలో వివిధ జిల్లాల్లో మొత్తం 71 మందిపై క్రిమినల్ కేసులు నమోదైవున్నాయని, ఇందులో రెండు కేసుల్లో శిక్ష కూడా పడిందని ఆయన గుర్తుచేశారు. 
 
పైగా, ఈ నెల 12వ తేదీన చేపట్టనున్న పాదయాత్రలో ఎంతమంది రైతులు పాల్గొంటారన్న విషయంపై రైతుల్లోనే స్పష్టత లేదని, పైగా ఎవరు వస్తారో కూడా తెలియనపుడు వారిని గుర్తించడం, పర్యవేక్షించడం అధికారులకు కష్టమవుతుందని, అందుకనే అనుమతి నిరాకరిస్తున్నట్టు చెప్పారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి భద్రత కల్పిచండం సాధ్యం కాదన్నారు. 
 
ఇటీవల ఉద్రిక్తంగా మారిన కోనసీమ ప్రాంతం మీదుగా యాత్ర జరుగుతుందని, ఆ సమయంలో అక్కడ చిన్నపాటి గొడవ జరిగినా అది పెద్ద సమస్యగా మారి శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈ యాత్రకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments