Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుంటిసాకులు వద్దు.. జీరో ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయండి : గౌతం సవాంగ్ ఆదేశం

Webdunia
మంగళవారం, 3 డిశెంబరు 2019 (11:38 IST)
హైదరాబాద్ నగరంలో జరిగిన దిశ అత్యాచారం, హత్య కేసు తర్వాత జీరో ఎఫ్ఐఆర్ తెరపైకి వచ్చింది. అసలు ఇలాంటి ఎఫ్ఐఆర్ ఒకటుందనే విషయం చాలా మందికి తెలియదు. దిశ అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆమె తల్లిదండ్రులు వెళ్ళగా, పోలీసులు అనుసరించిన వైఖరితో ఇపుడు జీరో ఎఫ్ఐఆర్ అంశం తెరపైకి వచ్చింది. 
 
అసలు జీరో ఎఫ్ఐఆర్ అంటే.. పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా... పీఎస్ వచ్చిన బాధితులన ఫిర్యాదలను స్వీకరించడమే జీరో ఎఫ్ఐఆర్. ఈ తాజాగా, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ రాష్ట్ర పోలీసులకు కీలక ఆదేశాలను జారీ చేశారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులకు కుంటి సాకులు చెప్పకుండా... జీరో ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయాలని ఆదేశించారు. 
 
బాధితులు అత్యవసర పరిస్థితుల్లో రక్షణ, న్యాయం కోసం పోలీస్ స్టేషన్లకు వస్తుంటారని... సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదులు చేస్తుంటారని... అయితే, మీ ప్రాతం మా పరిధిలోకి రాదంటూ ఫిర్యాదులను స్వీకరించడానికి పోలీసులు నిరాకరిస్తుంటారని ఆయన అన్నారు.
 
తమ నివాసం ఏ పరిధిలోకి వస్తుందో తెలుసుకుని, బాధితులు అక్కడకు వెళ్లే లోపల జరగాల్సిన ఘోరాలు జరిగిపోతుంటాయని గౌతమ్ సవాంగ్ చెప్పారు. బాధితులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు జీరో ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయాలని ఆదేశించారు. 
 
జీరో ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయడానికి నిరాకరించేవారు ప్రాసిక్యూషన్‌కు అర్హులవుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో జీరో ఎఫ్ఐఆర్‌లను అమలు చేస్తామని... వారం రోజుల్లో దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ సిద్ధం చేస్తామని తెలిపారు. పోలీసులు వాడుతున్న భాష సరిగా లేదనే ఫిర్యాదులు ఇప్పటికీ వస్తున్నాయని... స్పందన కార్యక్రమంతో కొంత మార్పు వచ్చిందని డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments