వీడిన ఉత్కంఠ : పర్యటనకు ఓకే.. విశాఖకు రానున్న చంద్రబాబు

Webdunia
ఆదివారం, 24 మే 2020 (21:42 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు అనుమతినిచ్చే విషయంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. సోమవారం విశాఖ జిల్లాలో చంద్రబాబు పర్యటించేందుకు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అనుమతి ఇచ్చారు. దీంతో చంద్రబాబు సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖకు విమానంలో చేరుకుంటారు. అక్కడ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులను పరామర్శిస్తారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో అమరావతికి చంద్రబాబు చేరుకుంటారు. 
 
కాగా, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ప్రాంతాల్లో పర్యటించాలని, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించాలని చంద్రబాబు నిర్ణయించుకుని, తన పర్యటనకు అనుమతి ఇవ్వాలని పేర్కొంటూ అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖల వద్ద అనుమతి కోరారు. ఈ అనుమతి కోరిన మరుక్షణమే తెలంగాణ పోలీసులు చంద్రబాబు హైదరాబాద్ నుంచి విశాఖపట్టణంకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. 
 
కానీ, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మాత్రం పెండింగ్‌లో పెట్టినట్టు కథనాలు వచ్చాయి. ఎట్టకేలకు ఏపీ డీజీపీ నుంచి కూడా అనుమతి రావడంతో సోమవారం చంద్రబాబు విశాఖ పర్యటనపై ఉత్కంఠ వీడింది. సోమవారం ఉదయం 10 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి వైజాగ్ బయల్దేరనున్నారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించిన అనంతరం చంద్రబాబు విశాఖ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ భేటీ ముగిసిన తర్వాత రోడ్డు మార్గంలో అమరావతి చేరుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments