Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీడిన ఉత్కంఠ : పర్యటనకు ఓకే.. విశాఖకు రానున్న చంద్రబాబు

Webdunia
ఆదివారం, 24 మే 2020 (21:42 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు అనుమతినిచ్చే విషయంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. సోమవారం విశాఖ జిల్లాలో చంద్రబాబు పర్యటించేందుకు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అనుమతి ఇచ్చారు. దీంతో చంద్రబాబు సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖకు విమానంలో చేరుకుంటారు. అక్కడ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులను పరామర్శిస్తారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో అమరావతికి చంద్రబాబు చేరుకుంటారు. 
 
కాగా, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ప్రాంతాల్లో పర్యటించాలని, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించాలని చంద్రబాబు నిర్ణయించుకుని, తన పర్యటనకు అనుమతి ఇవ్వాలని పేర్కొంటూ అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖల వద్ద అనుమతి కోరారు. ఈ అనుమతి కోరిన మరుక్షణమే తెలంగాణ పోలీసులు చంద్రబాబు హైదరాబాద్ నుంచి విశాఖపట్టణంకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. 
 
కానీ, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మాత్రం పెండింగ్‌లో పెట్టినట్టు కథనాలు వచ్చాయి. ఎట్టకేలకు ఏపీ డీజీపీ నుంచి కూడా అనుమతి రావడంతో సోమవారం చంద్రబాబు విశాఖ పర్యటనపై ఉత్కంఠ వీడింది. సోమవారం ఉదయం 10 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి వైజాగ్ బయల్దేరనున్నారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించిన అనంతరం చంద్రబాబు విశాఖ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ భేటీ ముగిసిన తర్వాత రోడ్డు మార్గంలో అమరావతి చేరుకుంటారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments