Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వం చేసిన మంచికి దేవుడి చల్లని దీవెనలు : సీఎం జగన్

Webdunia
ఆదివారం, 26 జూన్ 2022 (17:50 IST)
తన సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఆత్మకూరు ఓటర్లు మద్దతుగా నిలిచారని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికలో వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఘన ఘనవిజయం సాధించిన విషయం తెల్సిందే. 
 
ఆదివారం వెల్లడైన ఈ ఉప ఎన్నికల ఫలితాల్లో తన సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి భరత్‌కుమార్‌ యాదవ్‌పై 82,742 ఓట్ల మెజారిటీతో విక్రమ్‌రెడ్డి గెలుపొందారు. ఈ గెలుపుపై సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులతో విజయం సాధించామని ట్విటర్‌లో పేర్కొన్నారు. 
 
'ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్‌కు నివాళిగా ఆత్మకూరులో 83వేల భారీ మెజార్టీతో విక్రమ్‌ను దీవించిన ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, సోదరుడికి, స్నేహితుడికి, అవ్వకు, తాతకు... పేరు పేరునా ధన్యవాదాలు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులే శ్రీరామరక్ష' అని జగన్ కామెంట్స్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments