Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనితీరు బాగోలేని నేతలకు క్లాస్ పీకిన సీఎం జగన్

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (16:50 IST)
తాడేపల్లి ప్యాలెస్‌లో ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఇందులో పనితీరు ఏమాత్రం బాగోలేని నేతలకు ఆయన హెచ్చరికలు చేశారు. ముఖ్యంగా, ఏడుగురు ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం సరిగా లేదని, అందువల్ల వారికి టిక్కెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఏపీ ప్రభుత్వం ఇటీవల గడపగడపకు మన ప్రభుత్వంతో పాటు సామాజికన్యాయ భేరీ పేరుతో బస్సు యాత్రను చేపట్టింది. వీటికి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ముఖ్యమంత్రి అలెర్ట్ అయ్యారు. ఈ రెండు కార్యక్రమాలపై ఆయన ఒక నివేదిక తెప్పించుకున్నారు. ఆ తర్వాత పార్టీ నేతలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతో ఆయన బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. 
 
ఈ సమీక్షలో ఆయన తాను తెప్పించుకున్న నివేదిక‌ను బ‌య‌ట‌కు తీశారు. ఈ నివేదిక‌లో ప‌లువురి ప‌నితీరు బాగానే ఉన్నా... ఓ ఏడుగురు ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ జీరోగా ఉందని చెప్పారు. ఈ ఏడుగురు ఇళ్లు క‌ద‌ల‌కుండానే... త‌మ అనుచ‌రుల‌ను పంపుతూ కార్య‌క్ర‌మాన్ని నెట్టుకొస్తున్నార‌ని సీఎం బహిర్గతం చేసినట్టు సమాచారం. ఈ విష‌యాన్ని బ‌హిరంగంగానే వెల్ల‌డించిన జ‌గ‌న్‌... ఇలాగైతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇచ్చేది లేద‌ని తేల్చి చెప్పినట్టు సమాచారం. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే వారికే టికెట్లు ఇస్తామ‌ని జగ‌న్ స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం