Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ సిమ్లాకు ఫ్యామిలీ టూర్ - సిల్వర్ జూబ్లీ పెళ్లి వేడుకలకు ముందు..

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (12:24 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ టూర్ చేపట్టారు. ఒకవైపు పార్టీ అధినేతగా, మరోవైపు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిత్యం బిజీగా ఉండే సీఎం జగన్.. ఏమాత్రం సమయం లభించినా తన కుటుంబ సభ్యులతో గడిపేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి సిమ్లాకు విహారయాత్రకు వెళ్లారు. 
 
తాడేపల్లి నివాసం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుని. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో సీఎం తన ఫ్యామిలీతో కలిసి చండీగఢ్, అక్కడి నుంచి సిమ్లాకు బయలుదేరి వెళ్లారు. ఈ టూర్‌లోనే నత వ్యక్తిగత పనులను కూడా పూర్తి చేసుకోనున్నారు. 
 
సిమ్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను ఆయన సందర్శించనున్నారు. సీపీ బత్తిన శ్రీనివాస్, డీసీపీ హర్షవర్ధన్, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం తదితరులు సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షించారు. 
 
సీఎం జగన్​ వివాహం జరిగి ఆగస్టు 28కి సరిగ్గా 25 ఏళ్లు. ఈ సందర్భంగా సీఎం తన కుటుంబసభ్యులతో కలిసి ఈ టూర్ ప్లాన్ చేసుకున్నారని సమాచారం. ఆగస్టు 26 నుంచి 31 వరకూ ఆయన కుటుంబంతో అక్కడే గడపనున్నారు. సెప్టెంబరు 1న ఆయన తిరిగి ఏపీకి రానున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments