Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వాగ్ధానాన్ని నిలబెట్టుకుంటాం.. ఏపీ జగన్ హామీ

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (18:50 IST)
వైఎస్ఆర్ ఆసరా పథకం రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రారంభించారు జగన్. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేశ్, బాలినేని, విశ్వరూప్‌, పెద్దిరెడ్డి పాల్గొన్నారు.

ఎన్నికల ముందు తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆసరా పథకాన్ని అమలు చేస్తున్నామని, నేరుగా లబ్ధిదారులకు డబ్బులు వేస్తున్నామని జగన్ అన్నారు. డ్వాక్రా మహిళల పొదుపు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు చెప్పారు. పొదుపు సంఘాలకు ఇచ్చిన రుణాల వాగ్దానాన్ని నిలబెట్టుకున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. 
 
అప్పట్లో తాను పాదయాత్రలో చేసిన వ్యాఖ్యల వీడియోను ఈ సందర్భంగా జగన్ చూపించారు. చంద్రబాబు ఒక్క రూపాయి కూడా డ్వాక్రా రుణాల మాఫీ చేయలేదని అందులో జగన్ అన్నారు. స్వయం సహాయక సంఘాల రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పిన మాటలు నమ్మిన మహిళలు ఆయన్ను సీఎంను చేశారని.. కానీ చంద్రబాబు మాత్రం మహిళలను మోసం చేశారని జగన్ ఆరోపించారు. 
 
చంద్రబాబు మాటలు నమ్మి రుణాలు చెల్లించని కారణంగా బ్యాంకుల్లో వడ్డీలు పెరిగి రూ.14వేల కోట్లుగా ఉన్న రుణాలు 2019 ఎన్నికల నాటికి రూ.25,517 కోట్లకు పెరిందని తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 18.3శాతం పొదుపు సంఘాలు మూతబడగా.. మిగిలిన సంఘాల పరపతి దెబ్బతిందని జగన్ వాపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments